జనసేన పార్టీ ఏపీ రాజధాని విషయమై తన స్టాండ్ ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేసింది. అమరావతి లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని స్పష్టంగా తెలియజేస్తుంది. 3 రాజధానులు విషయం పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి జగన్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు వివిధ రాజకీయ పార్టీలను కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్యనేతలు నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటివారితో పాల్గొన్నారు.
మొదటి నుండి పవన్ వాదన ఒక్కటే. అమరావతి కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న దశలో దానిని దృష్టిలో ఉంచుకొని సరిగ్గా నెల జీతాలు చెల్లించడానికి డబ్బులు లేని వారు ఒక రాజధానిని ఎలా కడతారు అన్నది వారి ప్రశ్న. అమరావతినే రాజధానిగా డెవలెప్ చేయలేని జగన్ మూడు రాజధానుల అభివృద్ధికి కృషి ఎలా చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి జనాల్ని మభ్యపెట్టడం పక్కనపెట్టి ప్రభుత్వం అమరావతితోనేముందుకు సాగాలి అన్న వాదన మళ్లీ ఆ సమావేశంలో లేవనెత్తారు.
ఇక వారు దాఖలు చేయవలసిన కౌంటర్ విషయానికి వస్తే ఎంతో చాకచక్యంగా పవన్ తో సహా ముఖ్య నేతలంతా కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొదట రైతులకు న్యాయం జరగాలని జనసేన పార్టీ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇక రైతుల విషయంలోనే కూడా పవన్ పార్టీ గట్టిగానే నిలబడి వారికి కౌలు డబ్బులు ఇప్పించే వరకు ఊరుకోలేదు. ఇలాంటి సమయంలో రైతులకు మద్దతు పలకడమే సరైన కౌంటర్ అని రైతులకు న్యాయం జరిగే వరకు రాజధాని తరలించే ప్రసక్తే ఉండకూడదని కనిపిస్తుంది. ఇక అంత మంది రైతులకు ఈ ప్రభుత్వం సమన్యాయం చేసే క్రమంలో వచ్చే దశ ఎన్నికలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ‘రాజధాని అంశం’ అనే పదం లేవనెత్తితే జగన్ రాజ్యాంగం అనే పేరు ఎత్తుతాడు. కాబట్టి కచ్చితంగా రైతులకి న్యాయమే తమ తొలి అజెండాగా జనసేన మాట్లాడాలని… మిగతా విషయాలు అన్ని సెకండరీ అని ఫిక్స్ అయి కూర్చున్నట్లు సమాచారం.