YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం కోర్టులో హజరుపర్చారు. ఇరువర్గాల తరుపున కోర్టులో వాదనలు జరిగాయి.
నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తూ..ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని, అతనికి నేర చరిత్ర లేదని తెలిపారు. రాయి విసిరితే పోలీసులు హత్య యత్నం కేసు పెడతారా అని ప్రశ్నించారు. ఐపీసీ 307 సెక్షన్ ఈ కేసులో వర్తించదని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు.. ఆధార్ తేదీకి తేడా ఉందన్నారు. ఆధార్ కార్డు లో పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది సలీం కోరారు.
దురుద్దేశపూర్వకంగానే సీఎం జగన్ పై రాయితో దాడి చేశారని, హత్యయత్నం సెక్షన్ వర్తిస్తుందని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇచ్చిన ధృవపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. నిందితుడిని మే 2 వరకూ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్