మేం వస్తాం.. ప్రచారం చేస్తాం. మాకు రూపాయి వద్దు. మా ఖర్చులు మేమే భరిస్తాం` అని ఎవరైనా అం టే.. అభ్యర్థులు ఏం చేస్తారు? ఎగిరి గంతేసి.. వచ్చేయండి.. వచ్చేయండి! అంటూ రెడ్ కార్పెట్ పరిచేస్తా రు. టీడీపీలో అదే జరుగుతోంది. ఈ పార్టీ అధినేత చంద్రబాబు.. వస్తారా? ప్రచారం చేస్తారా? అని అడగడమే తరువాయి.. వందల మంది దేశాలు దాటుకుని. ఏపీకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చారు కూడా. వీరంతా ఎన్నారైలు. క్షణం కూడా తీరిక లేకుండా గడిపేవారు.
అయినా.. కూడా పార్టీపైనా, చంద్రబాబుపైనా అభిమానంతో వారం క్యు కట్టారు. సొంత ఖర్చులు పెట్టుకు ని.. మరీ ఏపీకి వస్తున్నారు. ప్రచారానికి దిగుతున్నారు. వీరి సేవలు వినియోగించుకునేందుకు టీడీపీ కూడా ద్వారాలు తెరిచే ఉంచింది. మరి కూటమి పార్టీ ఇంతగా ముందుకు దూసుకుపోతుంటే.. జనసేన లో మాత్రం స్తబ్దత కొనసాగుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి మెగా కుటుంబం వచ్చి ప్రచారం చేస్తామని చెబుతున్నా.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అదేసమయంలో కొందరు ఆర్ట్ డైరెక్టర్లు, త్రివిక్రమ్ శ్రీనివాస్వంటివారు పిఠాపురంలో ప్రచారం చేస్తామని చెబుతున్నా.. ఇప్పటిక రెండు సార్లు అడిగినా.. పవన్ మౌనంగానే ఉన్నారు. దీంతో పవన్ అదే తప్పు మళ్లీ చేస్తున్నారా? అనే చర్చ అయితే సాగుతోంది. గత ఎన్నికల సమయంలోనూ అనేక మంది సినీ రంగానికి చెందిన వారు పవన్కు ప్రచారం చేస్తామని చెప్పారు.కానీ ఒక్కరు కూడా రాలేదు. దీనికి పవనే కారణం. ముఖ్యంగా మెగా హీరో.. రామ్ చరణ్ వస్తానని చెప్పినా.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ ఇదే పంథాలో ముందుకు సాగుతున్నారు. అంతా తానే చూసు కుంటున్నారు. అంతా ఆయనే చూసుకోవడం తప్పుకాకపోయినా.. ఖచ్చితంగా వస్తామని.. బలమైన గళం వినిపిస్తామని చెబుతున్న వారికి కూడా అవకాశం ఇవ్వకపోవడం మాత్రం తప్పేనని చెబుతున్నారు. దీంతో రాజకీయంగా పవన్ మరోసారి తప్పుటడుగులు వేస్తున్నారా? అనే చర్చ అయితే.. తెరమీదికి వస్తుండడం గమనార్హం. మరి ఇప్పటికైనా ఆయన ఆలోచిస్తారో లేదో చూడాలి.