Lok sabha Elections 2024: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా పది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
నాలుగో విడతలో లోక్ సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఘండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్ సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుండి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 25వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. 29వరకు ఉపసంహరణ గడువు విధించారు. మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు కలెక్టరేట్ లో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాలి. లోక్ సభ అభ్యర్ధులు రూ.25వేలు, శాసనసభ అభ్యర్ధి రూ.10వేల ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి