తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకుని.. అనేక మీడియా సంస్థలు.. రాముడితో లింకు పెట్టి… ఏపీ పాలన ఇలా ఉంటే బాగుంటుంది.. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ.. పరోక్షంగా కూటమిని ప్రస్తావిస్తున్నారు. ఇదేసమయంలో గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెబుతూ వచ్చా రు. అంతేకాదు.. పలు సామాజిక వర్గాలు అణిచివేతకు గురయ్యారనేది కూడా ఈ కథనాల సారాంశం. దీనికి రాముడి పాలనలో జరిగిన మేళ్లను వివరించారు. ఇది తప్పుకాదు!
కానీ, అసలు ఇప్పుడున్న పరిస్థితిలో రామరాజ్యం సాకారమేనా? నిజానికి రాముడే దిగి వచ్చి.. పాలిస్తాన న్నా… నాటి పాలనను అందించే సాహసం ఆయన చేయగలడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక్కడ రెండు ప్రధాన అంశాలు పరిశీలించాలి. రాముడు రాజ్యం చేసింది.. వంశపారంపర్య రాజకీయంతో వచ్చి న రాజ్యం. కానీ, మనం ఉన్నది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలు నిర్ణేతలు. ఇక, నాటి రామాయణం కథనం మేరకు.. రాముడి ఇద్దరి తమ్ముళ్లు.. ఒక అన్న కూడా.. మంత్రులు. ఇది కూడా వంశపారంపర్యమే.
కానీ, ఇక్కడ అలా ఒకే కుటుంబం పాలన సాగించే అవకాశం ప్రజలు కోరుకుంటే తప్ప.. ఇచ్చేందుకు వీలు లేదు. కాబట్టి ఎలా చూసుకున్నా.. ప్రజాస్వామ్యానికి-రాముడి పాలనకు పొంతన ఉండదు. మరో కీలక విషయం.. రాముడిలా పాలించాలని ఆశపడడం తప్పుకాదు. కానీ, ప్రజాస్వామ్య ఎన్నికల క్రతువులో ఖర్చు పెట్టకుండా.. నాయకులు గెలిచే పరిస్థితి లేనప్పుడు.. రాముడిలా.. నిజాయితీగా పాలన అందిం చడం.. కేజ్రీవాల్ , మమతా బెనర్జీ వంటి.. కేవలం సీఎంగా వచ్చే జీతంపైనే ఆధారపడుతున్నా నన్న వారి వల్లే కావడం లేదు.
వారు అవినీతి పరులు కాదు. కానీ, చుట్టూ ఉన్న వారి పరివారంలో ఉప్పుగల్లులు చాలానే ఉన్నాయి. కాబట్టి.. రామరాజ్యం స్థాపన అనేది కేవలం మాటలకే పరిమితం. ఎవరు అధికారంలోకి వచ్చినా.. సంపూర్ణ రామరాజ్యం తీసుకువస్తామని చెబితే.. అది బూటకమే. నాటకమే అవుతుంది. అంతెందుకు.. అయోధ్యలో రామాలయం కట్టాం.. రాముడు మావాడే అని చెప్పుకొనే బీజేపీ.. తొలి దశ ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లను పరిశీలిస్తే.. 24 మంది అత్యంత కరడు గట్టిన నేరస్థులని కేంద్ర ఎన్నికల సంఘమే పేర్కొంది.
మరో 12 మంది అభ్యర్థులు.. ఇంకా తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్నవారే. కానీ, నాటి రాముడి పాలనలో ఇలా లేదు కదా! సో.. ఎలా చూసుకున్నా.. రామాయణంలో చెప్పినది ఆ కాలానికి పరిమితం.. ఈ కాలానికి ఆదర్శం.. అంతే!! కాబట్టి పోలిక తప్పు కాదేమోకానీ.. అదే వస్తుందని.. చెప్పడం మాత్రం అతిశయోక్తే!!!