Cine Editor Goutham Raju: తెలుగు చిత్ర సీమ (Tollywood) లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతమ్ రాజు మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రాజు మరణ వార్త తెలిసి చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. అనారోగ్యం నుండి కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. రాత్రి 1.30గంటలకు ఆయన మరణించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హైదరాబాద్ లో 1954 జనవరి 15న జన్మించిన గౌతమ్ రాజు..ఎడిటర్ గా తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా పని చేశారు. తెలుగు అగ్రహీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన ఎడిటింగ్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాధవి హీరో హీరోయిన్లుగా నటించిన “చట్టానికి కళ్లు లేవు” చిత్రంతో ఎడిటర్ గా గౌతమ్ రాజు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. దాదాపు 800 పైగా చిత్రాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పని చేసి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు.
జూనియర్ నటించిన ‘ఆది’ చిత్రానికి గౌతమ్ రాజు ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు. కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, బలుపు, అదుర్స్ వంటి బ్లాక్ బస్టర్ మువీలకు ఆయన ఎడిటర్ గా పని చేశారు. గౌతమ్ రాజు మృతి పట్ల సినీ పరిశ్రమ వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో గౌతమ్ రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!