పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు.
కాగా రీసెంట్ గా pawan kalyan వకీల్ సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో వకీల్ సాబ్ తర్వాత మొదలవ్వాల్సిన సినిమా అయ్యప్పనుం కోషియం. అయితే ఈ సినిమాలో కొంతమంది నటుల ఎంపిక పూర్తి కాలేదట. అందుకే జనవరి ఫస్ట్ వీక్ లో అనుకున్న షూటింగ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో pawan kalyan కి జంటగా సాయి పల్లవి నటించే విషయం లో క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో pawan kalyan క్రిష్ సినిమా చేయాలనుకున్నాడు. pawan kalyan – క్రిష్ ల సినిమా సెట్స్ మీదకి వచ్చేసింది. తాజాగా pawan kalyan షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు.
అయితే లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సాయి పల్లవి పవన్ కళ్యాణ్ తో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. ఇంతక ముందు పవన్ కళ్యాణ్ అయినా నో చెప్పడానికి కారణం ఒరిజినల్ వెర్షన్ లో sai pallavi కి అనుకున్న రోల్ చాలా తక్కువగా ఉండటమేనట. అంత చిన్న క్యారెక్టర్ అయితే sai pallavi చేయనని చెప్పిందట. అయితే ఇప్పుడు ఒరిజినల్ వర్షన్ కంటే తెలుగులో sai pallaviపాత్ర నిడివి పెంచడంతో పాటు క్యారెక్టర్ కి బాగా ఇంపార్టెన్స్ ఉండటం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక త్వరలో ఇందుకు సంబంధించిన అప్డేట్ రానుందని సమాచారం. ఏదేమైనా .. ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అయినా sai pallavi ని ఒప్పించడం అంత ఈజీ కాదని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!