Breaking: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఢిల్లీకి రేవంత్ రెడ్డి డబ్బులు పంపారని ఇటీవల కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.2,500 కోట్లు వసూలు చేసి అధిష్టానానికి పంపారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తూ ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కేటిఆర్ పై ఐపీసీ 504,505(2) సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
YSRCP: ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనదే గెలుపు – సీఎం జగన్