హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తున్నది. నాలుగు రౌండ్లు పూర్తి అయ్యే సరికి బీజెపీ అభ్యర్థి రఘునందనరావు టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత పై 3020 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ లో 341, రెండవ రౌండ్ లో 794, మూడవ రౌండ్ లో 124, నాల్గవ రౌండ్ లో 1425, అయిదవ రౌండ్ లో 336 ఓట్ల ఆధిక్యంలో బీజెపీ అభ్యర్థి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి మూడవ స్థానంలో ఉన్నారు.