Evaru Meelo Koteeshwarulu: ఎవరు మీలో కోటీశ్వరులు..త్వరలో ప్రముఖ ఛానల్ జెమినీ టీవిలో ప్రసారానికి సిద్దమవుతోంది. ఇదే షో ఇంతకముందు మీలో ఎవరు కోటీశ్వరులు అనే పేరుతో స్టార్ మా లో ప్రసారమయింది. ఒక సీజన్ కి మెగాస్టార్ చిరంజీవి, ఒక సీజన్కి కింగ్ నాగార్జున హోస్ట్స్గా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఎందుకనో మా వారు ఈ షోని రద్దు చేశారు. బిగ్ బాస్ మాత్రమే ఈసారి సిద్దం చేస్తున్నారు. దాంతో జెమినీ ఛానల్ ఈ షోని టేకోవర్ చేసింది. కొంచెం పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ షోకి జూనియర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని ప్రకటించగానే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
జూనియర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గం.లకు ప్రసారం కాబోతుంది. ఈనెల 22 ప్రారంభం కాబోతుండటంతో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. అందుకు కారణం మొదటి ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సందడి చేయబోతుండటమే. జూనియర్ ఎన్.టి.ఆర్ ముందు చరణ్ హాట్ సీట్లో కూర్చుని గేం ఆడబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ప్రసారమవుతూ షోపై ఉత్కంఠను పెంచుతోంది.
Evaru Meelo Koteeshwarulu: హాట్ సీట్ లో చరణ్ కూర్చిని తారక్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ 25లక్షలు గెలుచుకుంటాడట.
మెగా పవర్ స్టార్ రాం చరణ్ – జూనియర్ ఎన్.టి.ఆర్ కలిసి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఇద్దరు హీరోలు ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు. హాట్ సీట్ లో చరణ్ కూర్చిని తారక్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ 25లక్షలు గెలుచుకుంటాడట. ఆ మొత్తాన్ని పేదవారికి ఇచ్చేస్తానని ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!