అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవికి ఈ కీలక పదవిని కేటాయిస్తూ పత్రాలపై సంతకం చేశారు. వెంటనే నియామకపు ఉత్తర్వులను టిడిపి కార్యనిర్వహణ అధికారి అనిల్ సింఘాల్కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు.
ఆ పదవిలో కొనసాగుతున్న టిడిపి నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.
రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందనీ, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసిపి వర్గాలు తెలిపాయి.