Farmers Alert : రైతులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం రైతుల మేలుకోసం అనేక పధకాలు ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైనదిగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల రూపాయిలు అందిస్తున్న సంగతి విదితమే. ఇక ప్రస్తుతం మోదీ సర్కార్ ఇప్పటి వరకు 10 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. అంటే అన్నదాతలకు ఈ పధకం ద్వారా రూ.20 వేలు అందాయని చెప్పుకోవచ్చు.
Farmers Alert : 11వ విడత డబ్బులు కావాలంటే ఇలా చేయండి:
ఇకపోతే ఇప్పుడు 11వ విడత డబ్బులు పడాల్సి వుంది. అయితే ఈ డబ్బులు మీకు చేరాలంటే మీరు EKYC కచ్చితంగా పూర్తి చేసుకోవాలి అని కేంద్రప్రభుత్వం సూచిస్తోంది.
దానికి ఈ విధంగా చేయండి:
– ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లైతే ఫార్మార్స్ కార్నర్ అని ఉంటుంది. ఇందులో మీరు ఇకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ ఫస్ట్ క్లిక్ చేయాలి.
– ఇపుడు ఓపెన్ అయిన కొత్త పేజీలో రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
– తర్వాత ఆధార్ నెంబర్తో లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
– తర్వాత గెట్ మొబైల్ నెంబర్ OTP ఆప్షన్పై క్లిక్ చేస్తే, మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. దీన్ని అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ EKYC ప్రాసెస్ మొత్తం పూర్తి అవుతుంది.
గమనిక: ఇంట్లో ఒక్కరికి మాత్రమే PM కిసాన్ డబ్బులు వర్తిస్తాయి. ఒకరి కన్నా ఎక్కువ మంది డబ్బులు పొందినట్లైతే అది నేరంగా పరిగణించబడుతుంది.