TDP: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గొల్లపల్లి సూర్యారావు గత ఎన్నికల్లో రాజోలు నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్ధిగా స్వల్ప ఓట్ల తేడాతో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీ గూటికి చేరారు.
ప్రస్తుతం టీడీపీ పొత్తులో భాగంగా రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన తనకు రాజోలు సీటు ఇవ్వకుండా అవమానించారని గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ రాదని డిసైడ్ అయిన గొల్లపల్లి పార్టీని వీడినట్లు తెలుస్తొంది. కాగా, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే గొల్లపల్లి సూర్యారావు మార్చి మొదటి వారంలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు.
Road Accident: ఆటో – బస్సు ఢీ .. ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి, 12మందికి తీవ్ర గాయాలు