Keerthi Suresh : త్వరలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ఏడడుగులు కీర్తి సురేష్ వేయబోతున్న సంగతి తెలిసిందే. “మహానటి” సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న కీర్తి సురేష్..చాలామంది టాప్ హీరోల సరసన నటించడం జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్.
ఆల్రెడీ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి దుబాయ్ లో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్ షూటింగులో పాల్గొనడం జరిగింది. అయితే తాజాగా మరోసారి దుబాయ్ కి వెళ్ళటానికి కీర్తి సురేష్ రెడీ అవటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. నెల రోజులు గడవక ముందే రెండుసార్లు దుబాయ్ కి మహేష్ సినిమా షూటింగ్లో ఈ ముద్దుగుమ్మ పాల్గొనటంతో..మహేష్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోపక్క నితిన్ సినిమాలో కూడా.. నటిస్తుండటంతో అన్ని సినిమాలను కవర్ చేసుకోవడానికి కీర్తి బిజీబిజీగా మారినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది.
ఇదిలా ఉంటే చేతిలో ఉన్న అన్ని, ఒప్పుకున్న ప్రాజెక్టుల కంప్లీట్ చేసి తర్వాత ఇంక పెళ్ళయ్యాక ఫుల్లు రెస్టు తీసుకోవడానికి కీర్తి సురేష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతమాత్రమే కాకుండా “సర్కారు వారి పాట” సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అని, ఖచ్చితంగా సినిమా మొత్తానికి.. మహేష్ బాబుకి ఎంత వస్తుందో అదే రీతిలో తనకు కూడా వస్తుంది అని కీర్తి సురేష్ ..ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటుందట
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!