Trisha : త్రిష ని అందరూ ఫేడవుట్ అయిందనుకుంటే 96 సినిమాతో కం బ్యాక్ అయింది. వరసగా అధ్బుతమైన ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం త్రిష చేతిలో 6 – 7 సినిమాలున్నాయి. అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్. వీటిలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వం కూడా ఉంది. ఈ సినిమాలో త్రిష ఒక మంచి పాత్ర పోషిస్తోంది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా వరసగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న త్రిష కి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.
అయితే ఆ సినిమాకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ఇప్పుడు అందరిలో కలుగుతున్న ఆసక్తికరమైన ప్రశ్న. వాస్తవంగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో త్రిష నే నటించాల్సింది. ప్రకటన కూడా వచ్చింది. కాని అనూహ్యంగా త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కారణం ఏంటో తెలీదు గాని ఆ ప్లేస్ లో చందమామ కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చింది. సమ్మర్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ లాక్ చేశారు. మే 13 న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Trisha : ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ నటించిన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకి రాబోతోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఘనంగా ఈ సినిమా ప్రారభోత్సవం కూడా జరిగింది. ఈ నెలలోనే సెట్స్ మీదకి రానుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా త్రిష ని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే త్రిష మెగాస్టార్ తో కలిసి నటించింది. అలాగే దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో కూడా నటించింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో త్రిష ఉండే అవకాశం కూడా లేకపోలేదు.