పట్టికను సాధారణంగా ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారు.. అదే పట్టికను ఆయుర్వేద వైద్యంలో కూడా ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు.. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయని అతి కొద్ది మందికే తెలుసు.. అది తక్కువ ఖర్చుతో అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి పట్టిక ఎంతగానో ఉపయోగపడుతుంది పట్టిక ఒక యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. పట్టిక నీరు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
పట్టికను మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ పట్టికను తలకు పట్టిస్తే పేలు తగ్గిపోతాయి. పట్టికను పెనంపై వేడి చేసి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న పట్టిక నీరును గాయాలు ఉన్న చోట కడిగితే రక్తస్రావం ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్స్ కాకుండా చేస్తుంది. పట్టిక నీరును రెండు చుక్కలు కంట్లో వేసుకుంటే కండ్లకలక తగ్గిపోతుంది. పట్టిక నీరును నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. పొడి, దగ్గు, ఆస్తమా, థైరాయిడ్, జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలో పట్టిక అద్భుతంగా సహాయపడుతుంది. పట్టిక నీరుతో యోనిని శుభ్రం చేసుకుంటే వైట్ డిస్చార్జ్, ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది. శరీరంలోని వాపులు తిమ్మిర్లు తగ్గించడానికి కూడా ఈ నీరు సహాయపడుతుంది. అందుకు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్సే కారణం..
పట్టిక పొగుడు చెట్టు బెరడుని కలిపి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడి తో గనక పళ్ళు తోముకుంటే కదిలే పళ్ళు గట్టిపడతాయి. పళ్ళలో నుంచి నెత్తురు, చిమ్ము రాకుండా చేస్తుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. దంత సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.