టాలీవుడ్ స్టార్ హీరోలలో ‘కింగ్’ నాగార్జున ఏ పని చేసిన కింగ్ అనిపించుకుంటారన్నది మరోసారి ప్రూవ్ అయింది. 60 ఏళ్ళ వయసులో కూడా మన్మధుడు 2 లాంటి సినిమా చేసి యంగ్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీదున్నారు. ముందు నుంచి నాగార్జున కొత్త టాలెంట్ కి అవకాశాలివ్వడమే కాదు ప్రయోగాలతో వైవిధ్యమైన చిత్రాలలో విలక్షమైన పాత్రల్లో నటిస్తూ కొత్త ట్రెండ్ క్రియోట్ చేశారు.
అందుకు ఉదాహరణ శివ, గీతాంజలి, క్రిమినల్, అన్నమయ్య, మన్మధుడు వంటి సినిమాలు. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు తో సత్తా చాటాడు. ఆ తర్వాత బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరించి నాగ్ రేంజ్ ఏంటో చూపించాడు. టాలీవుడ్ లో బుల్లితెర మీద మొదటిసారి నాగ్ చేసిన షో తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి, ఎన్.టి.ఆర్, నాని బుల్లితెర మీదకొచ్చి సందడి చేశారు.
ఇక కరోనా కారణంగా గత ఆరు నెలలుగా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం షూటింగులకు అనుమతివ్వడంతో ఇప్పుడిప్పుడే మేకర్స్ ఒక్కో సినిమాని షూటింగ్స్ మొదలు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కరోనా స్టార్ హీరోలెవరూ సెట్స్ లో అడుగుపెట్టడానికి ధైర్యం చేయలేపోతున్నారు. కానీ కింగ్ నాగార్జున మాత్రం ఇలాంటి భయాలు తనకి లేవని తాజాగా రూపొందుతున్న సినిమా సెట్స్ లో అగుడుపెట్టి చూపించాడు.
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. వాస్తవ ఘటనలను ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ ని డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ రీసెంట్ గా మొదలు పెట్టారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!