ఈ రోజుల్లో మనుషుల్లో కనికరం లేకుండా పోతుంది. దయ తలచినా మనుషులే రాక్షసులుగా ప్రవర్తించి ప్రాణాలను బలి తీసుకుంటున్న సంఘటనలు ఇటీవల చాలానే జరుగుతున్నాయి. సొంత తల్లి పిల్లలను చంపడం అదేవిధంగా కట్టుకున్న భర్తను మోసం చేసే భార్యలు ఇలా చాలా రకాల క్రూరమైన మనుషులు చేస్తున్న క్రూరమైన పనులు మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఈ విధంగానే హైదరాబాద్ నగరం కాచిగూడ లో స్థానిక కమలమ్మ అనే 85 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలికి సహాయం చేయడానికి పని మనిషిగా లక్ష్మి అనే అమ్మాయి జాయిన్ అయ్యింది.
ఇటీవల ఆమెను దారుణంగా చంపి పరార్ అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం 85 సంవత్సరాల వయసు కలిగిన ఈ కమలమ్మని చూసుకోవాలని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నా పిల్లలు లక్ష్మీ ని పెట్టడం జరిగింది. మొదటిలో అంతా బాగోగులు బానే చూసినా లక్ష్మి కమలమ్మ ఒంటిపై ఉన్న బంగారం మరియు డబ్బుపై కన్ను పడింది. అదనుచూసి కమలమ్మని దిండుతో లక్ష్మి నొక్కి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారం…ఇంట్లో ఉన్న పదివేల రూపాయల డబ్బు తీసుకొని ఖరీదైన వస్తువులను తన వెంట తీసుకొని పారిపోయింది. ఆ సమయంలో ఆటోలో లక్ష్మీ పారిపోవడంతో అదే టైమ్ లో లక్ష్మి కి సంబంధించిన పాస్ బుక్ బయటపడటంతో దాని ఆధారంగా పోలీసులు ప్రస్తుతం విచారణ స్టార్ట్ చేశారు.