యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్స్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకి సంబంధించిన కీలక సన్నివేశాలను మొదలు పెట్టారట. అంతేకాదు ముందుగా టీజర్ కి కావలసిన సోలో షాట్స్ ని చిత్రీకరిస్తున్నట్టు తాజా సమాచారం. దసరా పండుగ సందర్భంగా కొమరం భీమ్ టీజర్ రానుందని రాజమౌళి హింట్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారకమైన ప్రకటన కూడా వచ్చి చాలా నెలలు కావస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ(చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కూడా కనిపించబోతున్నాడని అంటున్నారు.
కాగా ముందు నుంచి ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. కాని కొందరు ఈ టైటిల్ అంత క్యాచీగా లేదన్న కామెంట్స్ చేస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఫైనల్ గా ఏ టైటిల్ ని నిర్ణయిస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్ మరో వైపు ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఇద్దరు కూడా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ని మేయిన్ హీరోయిన్ గా ఫిక్సైనట్టు చెపుకుంటున్నారు. ప్రస్తుతం కూడా అదే మాట వినిపిస్తుంది. ఇక పూజా కూడా ఈ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఎప్పుడు నో చెప్పే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని అనుకుంటున్నట్టు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!