IPL 2021 : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి భారతదేశంలోని మిగిలిన ఫ్రాంచైజీలు తో పోలిస్తే అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అందుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ జట్టు మేనేజ్మెంట్ కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేసి చెన్నై ను ఛాంపియన్ జట్టుగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సారి జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. అతను చెన్నై మిడిల్ ఆర్డర్ లో కీలక సభ్యుడు కానున్నాడు. ప్రతి ఐపీఎల్ ఫ్రాంచెజీ చెట్టుకు స్పాన్సర్లు ఉంటారు. ఆ స్పాన్సర్లు తమ కంపెనీల లో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు. అలాగే చెన్నై చెట్టుకి ఒక స్పాన్సర్ ‘ఎస్ఎన్జె డిస్టిల్లరీస్’. ఇది ఆల్కహాల్ బేస్డ్ కంపెనీ.
ఇక చెన్నై జట్టులోని ఆటగాళ్లు ఆ లోగో ఉన్న జెర్సీ ధరిస్తున్నారు అంటే ఆ బ్రాండ్ కు వారు ప్రమోషన్ ఇస్తున్నట్లే. అయితే మొయిన్ అలీ ముస్లిం కావడంతో వారి మతాచారం ప్రకారం మద్యం సేవించడం కానీ, దానిని ఎటువంటి రీతిలో కూడా ప్రమోషన్స్ చేయడానికి వీల్లేదు. ఇది తెలిసి జరిగినా… తెలియక జరిగినా తప్పే కాబట్టి అతని జెర్సీ నుండి మాత్రం ఎస్ఎన్జే బ్రాండ్ లోగోని తొలగించింది.
ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిపోయింది. గతంలో హషీమ్ ఆమ్లా సౌత్ఆఫ్రికా జట్టుకి ఆడే సమయంలో కూడా ఆ జట్టు ప్రధాన స్పాన్సర్ లోగో ‘కాస్టిల్’ ని కూడా ఇదే కారణం వల్ల అతని నేషనల్ జెర్సీ పై కనిపించేది కాదు. గతంలో ఆర్సిబి జట్టు లో ఉన్నప్పుడు కూడా ప్రముఖ ఆల్కహాల్ బ్రాండ్ ‘కింగ్ ఫిషర్’ లోగో కూడా జేర్సీ పై కనిపించదు. అలాగే ఇప్పుడు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆర్సీబి జెర్సీ పై కూడా ఈ లోగా ఉండదు.