Manchu vishnu : మంచు విష్ణు మోసగాళ్ళు ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మంచు విష్ణు కి సోదరిగా కనిపిస్తుండటం ఆసక్తికరం. దాదాపు రెండేళ్ళ పైనే గడిచిపోయింది మంచు విష్ణు నుంచి సినిమా వచ్చి.
ఇక సాలీడ్ హిట్ దక్కి కూడా చాలా ఏళ్ళు అవుతోంది. యావరేజ్ టాక్ దగ్గరే మంచు సినిమాలు ఆగిపోతుండటంతో ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న కసితో ఏకంగా హాలీవుడ్ రేంజ్ కథతో మోసగాళ్ళు సినిమా చేశాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.
అయితే అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని పీక్స్ లో నిర్వహిస్తున్నారు. విష్ణు నిర్మాతగానూ సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందిన ‘మోసగాళ్ళు’ సినిమాని ఏవిఏ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఇటీవల వచ్చిన ట్రైలర్ తో హింట్ ఇచాడు.
Manchu vishnu : మెగాస్టార్ తో పాటు వెంకటేష్ లాంటి ప్రముఖులు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ సినిమా అభిప్రాయపడారట.
వాస్తవ సంఘటనల ఆధారంగా.. ప్రపంచంలో జరిగిన అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన మోసగాళ్ళు సినిమాని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కథ విన్న మెగాస్టార్ తో పాటు వెంకటేష్ లాంటి ప్రముఖులు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ సినిమాని ఇలాంటి సినిమా టాలీవుడ్ లో రావడం గొప్ప విషయం అని అభిప్రాయపడ్డారట. అంతేకాదు ఇలాంటి సినిమా చేయడం టాలీవుడ్ లో మంచు విష్ణు కి మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారట. మరి ఈ సినిమా మంచు విష్ణుకి ఎలాంటి సక్సస్ ఇస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!