Nithin: ఎపుడో అ..ఆ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న యూత్స్టార్ నితిన్ ఆ తర్వాత చేసిన లై, ఛల్ మోహన రంగ సినిమాలతో భారీ ఫ్లాపులను చూశాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వరుసగా సినిమాలను ప్రకటించాడు. వాటిలో వెంకీ కుడుమల దర్శకత్వంలో నటించిన భీష్మ మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఇక సక్సెస్ ట్రాక్ ఎక్కాను అనుకున్నాడు నితిన్. కానీ మళ్ళీ ఆశించిన విజయాలను అందుకోవడంలో వెనకబడుతున్నాడు. భీష్మ తర్వాత నటించిన చెక్ సినిమా ఫ్లాపవగా, రంగ్ దే సినిమా ఓ మాదిరి సక్సెస్ సాధించింది.
చెక్, రంగ్ దే హిట్ అయి ఉంటే నితిన్ దూకుడు మరోలా ఉండేదేమో. కానీ ఆ రెండు సినిమాలు నితిన్కు షాకిచ్చాయి. వీటి తర్వాత ఎన్నో నమ్మకాలు పెట్టుకొని బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ చిత్రాన్ని తెలుగులో మాస్ట్రోగా రీ మేక్ చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నభా నటేశ్, తమన్నా నటించారు. ఈ సినిమా కూడా నితిన్కి హిట్ ఇవ్వలేకపోయింది. ఇలా వరుసగా సినిమాలు ఫ్లాపవుతుండటంతో నితిన్ ఆచితూచి కొత్త ప్రాజెక్ట్స్ను కమిటవుతున్నాడు.
Nithin: సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్లు ప్లాన్ ..!
ప్రస్తుతం మాచర్ల నియోజిక వర్గం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఇప్పుడు సినిమాలకంటే కూడా డిజిటల్ రంగంలోనే ఎక్కువ సక్సెస్లు మంచి లాభాలు వస్తున్నాయి. ఆహాలో వస్తున్న సినిమాలు, షోస్తో బాగానే లాభాలు దక్కుతున్నాయి. అందుకే నితిన్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్లు ప్లాన్ చేయాలనుకుంటున్నాడట. వాటిలో నితిన్ నటిస్తాడని సమాచారం. సొంత ఓటీటీలో కాబట్టి చాలా లిమిటెడ్ బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్లు నిర్మించబోతున్నాడని అంటున్నారు. త్వరలో దీనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!