రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు రెండేళ్ళు అవుతోందట. వాస్తవంగా ప్రభాస్ సాహో సినిమా సమయంలోనే రాధేశ్యామ్ కూడా మొదలైంది. అంతేకాదు సాహో రిలీజ్ కాకుండానే రాధేశ్యామ్ ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. కాని ఎంతకీ ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ కావడం లేదు. కొన్నాళ్ళు పూజా హెగ్డే హెల్త్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
ఆ తర్వాత కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల రాధేశ్యామ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత కరోనా కారణంగా దాదాపు 6 – 7 నెలలుగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకి రాధేశ్యామ్ షూటింగ్ చివరి దశకి చేరుకుంది. కాగా ఈ సినిమా కోసం హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటి వరకు 87 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొందట. ఈ విషయాన్ని పూజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హీరోయిన్ 87 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే హీరో ప్రభాస్ ఈ సినిమా కోసం ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేసి ఉంటాడో అని ఫ్యాన్స్ షాకవుతున్నారట.
కాగా రాధేశ్యామ్ షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం. కాని సోషల్ మీడియాలో మాత్రం ఇంకా ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజులు జరిపితే గాని టాకీ పార్ట్ కంప్లీట్ అవదని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా అయితే ఈ డిసెంబర్ ఎండింగ్ కి రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారని అన్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రభాస్ జనవరి నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు. అలాగే బాలీవుడ్ లో స్ట్రైట్ గా ఎంట్రీ ఇస్తున్న హిస్టారికల్ మూవీ ఆదిపురుష్ కూడా జనవరి నెలలోనే మొదలవబోతుందని అంటున్నారు. ఇక పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల కోసమే ఇక్కడ చేస్తున్న సినిమాల కి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిందని చెప్పుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!