యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు.
ప్రభాస్ కెరీర్లో 21వ సినిమా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ సమర్పణలో ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మిస్తున్నారు.సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నికల్ టీం తో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణే నటించనుందని రీసెంట్ గా అధికారకంగా చిత్ర యూనిట్ వెల్లడించారు. దీపిక పదుకొణె హీరోయిన్ అన్నప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో పెద్ద చర్చలే జరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ మేకర్స్ సంగీత దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వకుండా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్ తమ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదన్న ఉద్దేశ్యంతో వీలైనంత త్వరగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేయాలనుకున్నారట.
ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియాలో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా క్రేజ్ ఉన్న రెహమాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తే క్రేజ్ పీక్స్ లో ఉంటుందని భావిస్తున్నారట. మరో వైపు ఎమ్.ఎమ్. కీరవాణి గురించి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
”బాహుబలి” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి అయినా సినిమా స్థాయి ఒక రేంజ్ లో ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ప్రభాస్ చేతిలో ఉందని అంటున్నారు. మరి ప్రభాస్ ఎవరిని ఫైనల్ చేస్తాడో అన్న సస్పెన్స్ ఇప్పుడు చాలామందిని టెన్షన్ పెడుతుంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!