యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతుందని తాజా సమాచారం. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సమర్పిస్తుండగా యూవి క్రియీషన్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక రీసెంట్ గా రాధే శ్యామ్ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ దృష్ఠిలో పెట్టుకొని రాధే శ్యామ్ విడుదల హక్కుల కోసం బాలీవుడ్ లో బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బాగా పోటీపడుతున్నారట. ముఖ్యంగా కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఎలాగైనా రాధే శ్యామ్ విడుదల హక్కులు దక్కించుకోవాలి పట్టుదలగా ఉన్నారట. ఇంతకముందు కూడా ప్రభాస్ బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలకు కరణ్ డిస్ట్రిబ్యూటర్ అన్న సంగతి తెలిసిందే.
ఇక రాధే శ్యామ్ కి ఏర్పడిన డిమాండ్ కారణంగా భారీ ధరకు ఆ సినిమా హిందీ విడుదల హక్కులు అమ్ముడయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. సాహో మూవీతో బాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ అందుకొని ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు రాధే శ్యామ్ కి అదే రేంజ్ లో క్రేజ్ నెలకొంది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు.