రానా, సాయిపల్లవి, ప్రియమణి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘విరాటపర్వం’. సాయి పల్లవి, ప్రియమణి ఈ సినిమాలో నక్సలైట్స్ గా కనిపించనుండగా వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. డి. సురేష్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. హాలీవుడ్కు చెందిన డానీ సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ఇక వాస్తవంగా సమ్మర్లోనే రిలీజ్ కావాల్సిన ‘విరాటపర్వం’ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది.
ఇక ఈ సినిమాతో పాటు రానా అరణ్య అన్న సినిమాలోను నటిస్తున్నాడు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో రానా అడవి మనిషిగా నటిస్తుండగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కరోనా కష్టాలు కమ్ముకున్నాయి. ఇక మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమాని కంప్లీట్ చేశాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా అని చేయబోతున్నాడు.
ఇస్మార్ట్ బ్యూటీస్ నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే ఐటం సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ ని సంప్రదించారట. అయితే ఇప్పుడు రానా రవితేజ కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ లో నటించబోతున్నారని తాజా సమాచారం. మళయాళ సూపర్ హిట్ అయ్యప్పన్ కోషియం రీమేక్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నాయి. ఈ రీమేక్ లో రవితేజ, రానా నటించబోతున్నారట. కరోనా ఎఫెక్ట్ తగ్గితే నవంబర్ నుంచి షూటింగ్ మొదలయ్యో అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!