టాలీవుడ్ లో రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ ఏడాది వరసగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ’, నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. ఆ ఊపుతో ఏకంగా పాన్ ఇండియన్ సినిమా పుష్ప సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇలా వరసగా భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రష్మిక ఇటీవలే కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టి కార్తి సరసన సుల్తాన్ అన్న సినిమా కంప్లీట్ చేసింది. అంతేకాదు తాజాగా మరో సినిమాకి సైన్ చేసింది.
ఇక కన్నడలో ఈ బ్యూటి నటించిన సినిమా పొగరు పేరుతో తెలుగులో రిలీజ్ కాబోతోంది. కాగా రష్మిక కి టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తో అవకాశం అందుకుందని లేటెస్ట్ అప్డేట్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి జంటగా నటించబోతోందట. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ తో మేజర్ టాకీపార్ట్ కంప్లీట్ అవుతుందట.
కాగా నెక్స్ట్ షెడ్యూల్ లో రాం చరణ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. కాగా ఈ షెడ్యూల్ లో చరణ్ కి జంటగా నటించే హీరోయిన్ కూడా పాల్గొనాల్సి ఉండగా ఆ హీరోయిన్ రష్మిక అని తెలుస్తోంది. పాత్ర చిన్నదే అయినా చరణ్ సరసన కావడం .. అలాగే కొరటాల – మెగాస్టార్ ప్రాజెక్ట్ కావటం తో ఒకే చెప్పిందని తెలుస్తోంది. ఇక ఈ పాత్రకి గాను రష్మిక కి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇక మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ సరసన రష్మిక ని కొరటాల ఎంపిక చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ బాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉండబోతోందని పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెజీనా – మెగాస్టార్ మీద ఇప్పటికే స్పెషల్ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు కొరటాల. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుతుందని అంటున్నారు. సమ్మర్ లో ఆచార్య రిలీజ్ కాబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!