రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ సినిమాలతో యమా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా లో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరగబోతోంది. కాగా ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
కాగా రష్మిక మందన్న కి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. కారణం 5 ప్రధాన భాషల్లో తెరకెక్కుతుండటమే. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా పుష్ప రిలీజ్ కాబోతుండటం తో రష్మిక మందన్న ఈ సినిమా కోసం చాలానే శ్రమిస్తోంది. కాగా ఈ సినిమా కంటే ముందే అనూహ్యంగా రష్మిక బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ఆఫర్ వచ్చింది. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా కి జంటగా ‘మిషన్ మజ్ను’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుందని లేటెస్ట్ అప్డేట్.
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లో ఈ కన్నడ బ్యూటీ కి ఆఫర్ వచ్చిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి కూడా సైన్ చేసేసిందని చెప్పుకుంటున్నారు. తండ్రి – కూతురు మధ్య సాగే కథ కావడం అది కూడా అమితాబ్ కి కూతురుగా అవకాశం అనగానే రష్మిక ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుందట. తాప్సీ ఇలా అమితాబ్ తో చేసిన పింక్, బద్లా సినిమాలతోనే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆ క్రేజ్ కోసం ఆరాటపడుతోంది. ఇక ఈ సినిమాకి వికాస్ బల్ దర్శకత్వం వహిస్తుండగా ” డెడ్లీ ” అన్న టైటిల్ తో తెరకెక్కబోతోందట. అంతేకాదు 2021 మార్చ్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తెలుస్తోంది. పుష్ప తో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాలతో రష్మిక మందన్న బాలీవుడ్ లో సెటిలవడానికి బాగానే ప్లాన్ చేసుకుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!