సర్కారు వారి పాట… సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న తాజా చిత్రం. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమా కాగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతమందిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ఇది ఎంత వరకు నిజమన్నది అధికారకంగా వెల్లడి కాలేదు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సినిమాలో ఒక ముఖ్య పాత్ర బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ పోషించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటికే భాగ్యశ్రీ ప్రభాస్ పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆ పాత్ర మీద రెండు రకాల మాటలు వినిపిస్తున్నాయి. కొందరేమో ప్రభాస్ కి తల్లిగా నటిస్తుంది అని అంటుంటే మరికొందరేమో ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తుందని అంటున్నారు.
ఇక సర్కారు పారి పాట సినిమాలో మాత్రం భాగ్యశీ మహేష్ బాబు కి తల్లిగా నటించబోతుందని అంటున్నారు. ఇప్పటికే చిత్ర బృందం భాగ్యశ్రీని సంప్రదించగా తను పాజిటివ్ గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించేంత వరకు నమ్మలేము. ఇక సర్కారు వారి పాట సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందని తెలుస్తుంది. 2021 సమ్మర్ లో రిలీజ్ చేసే విధంగా మేకర్స్ చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నారట. సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ లో సర్కారు వారి పాట రావడం ఫ్యాన్స్ కి కాస్త నిరాశే అని చెప్పాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!