Sankalp reddy : ఘాజీ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజై హిట్ సాధించింది. ఘాజీ సినిమాతో టాలీవుడ్ మేకర్స్ని మాత్రమే కాదు యంగ్ హీరోల నుంచి మెగాస్టార్ లాంటి లెజండరీ నటులను ఆకట్టుకున్నాడు. మొదటి సినిమానే రానా లాంటి స్టార్ హీరోతో తీయడం అలాగే ఆ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ రాపోతోనే మెగా ఫ్యామిలీ హీరో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో నెక్స్ట్ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.
‘అంతరిక్షం’ పేరుతో వచ్చిన ఈ సినిమా మొదటి సినిమా ఘాజీ రేంజ్లో సక్సెస్ సాధించలేదు. దాంతో ఈ డైరెక్టర్కి కాస్త గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో వెబ్ సిరీస్ ఒకటి చేశాడు. అయితే అనూహ్యంగా సంకల్ప్ రెడ్డికి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో డైరెక్టర్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.
Sankalp reddy : ‘జేబీ 71’ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’తో సందీప్ రెడ్డి, ‘ఛత్రపతి’ రీమేక్ తో వి.వి.వినాయక్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం అందుకున్నాడట. ఆయనే సంకల్ప్ రెడ్డి. బాలీవుడ్ రచయిత ఆదిత్య శాస్త్రి అందించిన కథతో సంకల్ప్ హిందీలో సినిమా చేయనున్నాడట. ‘జేబీ 71’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతుండగా, ప్రముఖ నటుడు విద్యుత్ జమాల్ ఆయన సొంత సంస్థలో ఈ మూవీని నిర్మించబోతుండటం విశేషం. ఈ సినిమా కథ ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!