రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన రెండు సినిమాలకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్నాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తన 20 సినిమాకి రాధే శ్యామ్ అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఇది అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది. ఇక త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వేళ్ళేందుకు సర్వం సిద్దం చేస్తున్నారట మేకర్స్.
అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిరించే 50 వ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుండగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణె ని ఎంచుకున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. మిగిలిన నటీ నటులు, టెక్నీషియన్స్ ని త్వరలో వెల్లడించనుండగా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారు.
ఇక సాహో మాదిరిగా సస్పెన్స్ లో ఉంది రాధే శ్యామ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రాధే శ్యామ్ మేకర్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని అనుకుంటున్నారట. అతనే అల వైకుంఠపురంలో సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సాధించిన థమన్ అని తెలుస్తుంది. రవితేజ మిరపకాయ్, కిక్ లాంటి సినిమాలతో వరసగా బ్లాక్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన థమన్ కొన్నాళ్ళు ఫార్మ్ కోల్పోయాడు. మళ్ళీ అల వైకుంఠపురంలో ఆల్బం తో ఫుల్ ఫాం లోకి వచ్చి దేశవ్యాప్తంగా ఈ సినిమా సాంగ్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఈ సినిమా ఆల్బం విషయంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా థమన్ ని అభినందించారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంచుకోవాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామాగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!