పబ్జీ గేమ్ ఎందరినో ఆత్మహత్యలకు పురిగొల్పింది. చాలామంది మతులు పోగొట్టింది.ఇది అత్యంత ప్రమాదకరమైన గేమ్ గా పేరు తెచ్చుకుంది.చివరకు ఈ గేమ్ కారణంగానే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఒక విద్యార్థి మరణించాడన్న వార్త సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళితే ..ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపురి గ్రామంలో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగర మురళి(18) గుండెపోటు తో ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం స్నేహితులతో గడిపిన మురళి ఇంటికి వచ్చి తల్లి వద్దకు వెళ్లి కుప్పకూలిపోయాడు. ఊహించని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మురళిని చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు గా వైద్యులు ధ్రువీకరించారు .కాగా మురళికి చాలామంది స్నేహితులున్నారని వారు పబ్జి గేమ్ ఆడుతున్నట్లుగా కాలనీ వాసులు తెలిపారు.అయితే మురళీ స్నేహితులు దీన్ని ఖండించారు ఇదిలా ఉండగా వేటపాలెం ఎస్సై అజయ్బాబు ఈ సంఘటనపై వివరణిస్తూ తమకి కూడా పబ్జీ గేమ్ కారణంగానే మురళి మరణించినట్లు సమాచారం అందిందని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నామన్నారు.
మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి గాయాలు లేవు కాబట్టి ఇది సహజ మరణమేనని గుండెపోటు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నాం అన్నారు.విచారణ కొనసాగిస్తామన్నారు .కాగా పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇవ్వొద్దని,ఇచ్చినా నిఘా పెట్టాలని,వారు ఏ గేమ్ ఆడుతున్నారో గమనించాలని ఎస్సై సూచించారు.మానసిక శాస్త్రవేత్తలు కూడా పబ్జీ గేము ఆడొద్దని సూచిస్తున్నారు.అయినా వినే వారెవరు?దీనిని ఆపేదెవరు?