ఊపిరి సినిమా తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి సినిమాని తీసి సూపర్ హిట్ ఇచ్చాడు వంశీ పైడిపల్లి. అంతేకాదు ఇదే సమయంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. మహర్షి తర్వాత మహేష్ బాబు సరిలేరి నీకెవ్వరు చేశాడు. ఈ సినిమా జరిగినన్ని రోజులు తర్వాత సినిమా దిల్ రాజు వంశీ పైడిపల్లి మహేష్ బాబు కాంబినేషన్ లోనే ఉంటుందని అందరూ భావించారు. కాని మహేష్ బాబు కి పూర్తి స్థాయిలో కథ నచ్చక ఈ దర్శకుడికి నో చెప్పేశాడు. ఆ తర్వాత గీత గోవిందం ఫేం పరశురాం తో సర్కారు వారి పాట ని అనౌన్స్ చేశాడు.
అప్పటి నుంచి మరో హీరోని పట్టుకునే పనిలో పడ్డ వంశీపైడి పల్లి కి ఏ హీరోతోను ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ఫైనల్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎవడు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళని రాబట్టింది. ఆ తర్వత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు.
ఇక ఈ సినిమాని చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు దిల్ రాజు కలిసి నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం రాం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య లోను చరణ్ ఒక పాత్ర చేస్తాడని అంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!