సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం కాంబినేషన్ లో రూపొందనున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్స్ సమ్యుక్తంగా నిర్మిస్తుండగా మహేష్ సమర్పిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ నుంచి నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపేందుకు పరశురాం పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేశడట.
ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించారని లేటెస్ట్ అప్డేట్. ముందు షూటింగ్ ఈ సెట్ లోనే ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం పరశురాం యూనివర్సల్ కాన్సెప్ట్ అయిన భారత బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణాలను సర్కారు వారి పాట లో ప్రధానంగా చూపించబోతున్నాడట దర్శకుడు. ఈ మద్య కాలంలో మహేష్ ఇలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ చేయకపోవడంతో సర్కారు వారి పాట సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్.. ట్విస్ట్ లు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయంటున్నారు. అలాగే హీరో, హీరోయిన్స్ మద్య మంచి రొమాన్స్ ట్రాక్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే మహేష్ మేకోవర్ .. టైటిల్ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కంప్లీట చేసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయో పాన్ ఇండియన్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతాడు మహేష్.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!