Rashmika Mandanna: ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు రాజకీయ నాయకుల ఇండ్లతో పాటుగా సినీ తారల ఇండ్లపై కూడా ఐటీ అధికారులు సోదాలు చెయ్యడం మనం చూస్తూ ఉన్నాం. గత ఏడాది, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న Rashmika Mandanna తెలుగు ఇండస్ట్రీతో పాటుగా కన్నడ ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లతో దూసుకుపోయింది. అప్పటిలో రష్మిక ఇంట్లో మరియు ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
క్రిందటి సంవత్సరం రాష్మీక ఇంటి మీద ఐటీ సోదాలు జరిగినప్పుడు సోషల్ మీడియా మొత్తం అదే హాట్ టాపిక్ అయ్యింది. సరిగ్గా ఇది జరిగి సంవత్సరం అవుతుంది. మళ్ళి ఇప్పుడు అదే వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కోడుతుంది. రష్మిక మందాన ఇంట్లో మరియు ఆఫీస్ లో రెండవ సారి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు అన్న వార్త మళ్ళి సెన్సషనల్ అయ్యింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వార్త వైరల్ అవుతుంది. తాజాగా రష్మిక ఈ విషయమై స్పందించింది.
“నా ఇంటిపై కానీ ఆఫీస్ పై కానీ ఐటీ దాడులంటూ ఏమీ జరగలేదు. అవన్నీ కేవలం పుకార్లే. అసలు మాకు అటువంటి నోటీసులు ఏమి రాలేదు” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. అయితే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లను పుట్టించి తన ఫేమ్ ను దెబ్బతీయాలని చూస్తున్నారని అంటుంది రష్మిక.
ప్రస్తుతం ఈ కన్నడ ముద్దుగుమ్మ టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలో వరుస హిట్లతో టాప్ హీరోయిన్ స్థాయిని దక్కించుకుంది. ఇండస్ట్రీ లో తన నటనతో తన సత్తాను చాటుకుంది రష్మిక మందన్న. రష్మిక త్వరలోనే తెలుగులో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!