ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ పరంగా కొందరు ట్రబుల్ షూటర్లు ఉన్నారు. జగన్ దగ్గర ఎంతమంది ట్రబుల్ షూటర్లు ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అంటే ఎంతో నమ్మకం. వీరిద్దరి విషయంలో జగన్ ఎంతో భరోసాగా ఉన్నారు. పెద్దిరెడ్డి అంటే పార్టీకి పెద్ద బిగ్ ట్రబుల్ షూటర్ గా జగన్ నమ్ముతున్నారు. ఒక పెద్దిరెడ్డి మాత్రమే కాదు ఆయన తనయుడు మిథున్ రెడ్డికి కూడా కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు.
రాయలసీమలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలు పెద్దిరెడ్డి కీలక బాధ్యతలు తీసుకుంటే ఇటు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికలు మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక పెద్దిరెడ్డికి ఇప్పటికే అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త పగ్గాలు అప్పగించారు. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో పెద్దిరెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కీలకమైన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పగ్గాలు కూడా పెద్దిరెడ్డికే జగన్ కట్టబెట్టారు.
తిరుపతి పార్లమెంటు సమన్వయకర్త పగ్గాలు కూడా పెద్దిరెడ్డికే అప్పగించడం వెనక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని తెలుస్తోంది. ఈ పార్లమెంటు పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ కాస్త వీక్గా ఉంది. చాలా గొడవలు నడుస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు సీటు గెలుచుకోవాలంటే అక్కడ పెద్దిరెడ్డిని రంగంలోకి దింపి.. గొడవలు సర్దుబాటు చేయిస్తే తప్పా పనికాదన్న నిర్ణయానికి వచ్చే జగన్ అక్కడ పగ్గాలు పెద్దిరెడ్డికి అప్పగించారని అంటున్నారు.
సూళ్లూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి మంత్రాంగం నడిపి అవి చక్కపెట్టని పక్షంలో తిరుపతి పార్లమెంటుపై ఎఫెక్ట్ పడుతుందనే జగన్ నేరుగా ఈ పార్లమెంటు సీటు ఇన్చార్జ్ పగ్గాలు ఆయనకే ఇచ్చారంటున్నారు. మరి ఈ టాస్క్ను పెద్దిరెడ్డి ఎలా టాకిల్ చేస్తాడో ? చూడాలి.