ప్రస్తుతం చలికాలం కావడంతో ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాలు అదేవిధంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ కీలక అడుగు వేసింది. పూర్తి విషయంలోకి వెళ్తే గిరిజన పుత్రులకు సీజనల్ వ్యాధులు రాకుండా దోమతెరలు ఉచితంగా పంపిణీ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు.
శీతాకాలం కారణంగా గాలిలో అధిక తేమ ఉండటంతోపాటు దోమల పెరుగుదల కూడా ఉండటంతో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 7 ఐటీడీఏల పరిధిలో 25.16 లక్షల గిరిజన కుటుంబాలకు దోమ తెరలను అందించడమే కాక వాటి వినియోగంపై అవగాహన కల్పించే రీతిలో చైతన్య కార్యక్రమాలను స్టార్ట్ చేయనుంది.
గతంలో ఉన్న ప్రభుత్వాలు దోమతెరలు ఇచ్చినా గానీ వాటి వినియోగం పై గిరిజన పుత్రులకు అవగాహన లేకపోవడంతో వాటిని బీరువాలో దాచుకోవటం తో అనేకమంది అనారోగ్యాలకు గురి అయ్యి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దోమల మందు పిచికారి ఈ విషయంలో కూడా గిరిజన ప్రాంతాలలో ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల చేత చైతన్యం అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పుకొచ్చారు.