ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నవరత్నాలలో మెజార్టీ పథకాలకు ఆయన తండ్రి గారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేర్లను పెట్టిన జగన్ తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రాష్ట్ర ‘రైతు దినోత్సవం’ గా ప్రకటించారు.
ఎక్కడికి వెళ్ళినా పట్టు పంచ మరియు కండువాను రైతుల గుర్తుగా.. తెలుగు వాడి నాడిలా ధరించే రాజశేఖర్ రెడ్డి గారి స్మృతిగా మరియు ఆయన హయాంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న అనేక చర్యలకు గుర్తుగా ఆయన పుట్టిన రోజు రైతు దినోత్సవం గా పరుపుకోవాలని ఏపీ సర్కార్ చెప్పింది.
ఇప్పటికే వచ్చే నెల మొదట్లో అనగా జూలై మొదటి వారంలో వైయస్సార్ అంబులెన్సులు 104-108 నెంబర్ లపై ప్రారంభం కానుండగా…. రాజశేఖర్ రెడ్డి స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8న రైతు దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై విపక్షాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.