ఎస్ ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే జనసేన – టీడీపీ పొత్తు ఖరారైంది. అటు ఈ కూటమిలోకి బీజేపీ కూడా వచ్చి చేరే వాతావరణమే కనిపిస్తోంది. జనసేనకు 26 అసెంబ్లీ, 2 – 3 పార్లమెంటు సీట్లు ఇవ్వాలన్న చర్చలు నడుస్తున్నాయి. అంతా బాగానే ఉంది. అటు బీజేపీ కూడా పొత్తు ఉండాలని తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని చంద్రబాబుపై ప్రెజర్ చేస్తుండడంతో చంద్రబాబు ఏం చేయాలో తెలియక డైలమాలో పడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు జనసేనకు 26 సీట్లు కూడా ఇచ్చేందుకు బాబు ఇష్టంగా లేరని అంటున్నారు.
పవన్ కనీసం 30 కు పైగా సీట్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. చంద్రబాబు జనసేనకు ముందు కొన్ని సీట్లు ఇచ్చి ఆ తర్వాత జనసేన గెలవదు అని తాను అనుకున్న చోట్ల టీడీపీ అభ్యర్థులకు కూడా బీఫామ్లు ఇచ్చి నామినేషన్లు వేయించాలన్న ప్లాన్లో ఉన్నారని.. ఈ ప్లాన్ గతంలో బాబు మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకుని ఫాలో అయ్యారని.. ఈ ఎన్నికల్లోనూ అలాగే ముందుకు వెళ్లేలా ఉన్నారని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చారు. అందులోనూ కొన్ని సీట్లలో మళ్లీ టీడీపీ పోటీ చేసింది. అదేంటంటే అక్కడ బీజేపీకి అంత సీన్ లేదని.. అక్కడ మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. మరి ఇది మిత్రధర్మం విస్మరించడమే అని చెప్పాలి. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా ఖచ్చితంగా ఓడిపోయే రాజంపేట, తిరుపతి పార్లమెంటు సీట్లు ఇచ్చింది. అలాగే కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీకి ఇచ్చి తర్వాత టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టింది.
కాస్త ముందుకు వెళితే 2009 ఎన్నికల్లో టీడీపీ – టీఆర్ఎస్ ( అప్పుడు) పొత్తు ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్కు ఇచ్చిన సీట్లలోనే కొన్ని చోట్ల చంద్రబాబు టీడీపీ వాళ్లకు బీఫామ్లు ఇచ్చి పెటీ చేయించాడు. ఇలా పొత్తు పొత్తు అంటూనే పొత్తు ధర్మం విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే వెన్నుపోటు జనసేనకు కూడా బాబు పొడుస్తారా ? అన్న చర్చలు ఉన్నాయి. జనసేనను కూడా ఇదే భయం వెంటాడుతోంది.
చంద్రబాబు ఏం చేసినా పవన్ మాట్లాడలేని పరిస్థితి. సింగిల్గా వెళితే పార్టీ మళ్లీ ఒక్కసీటు అయినా గెలుస్తుందా ? కనీసం తాను ఎమ్మెల్యేగా అయినా గెలుస్తానా ? అన్న డౌట్లు పవన్కు ఉన్నాయి. అందుకే పవన్ మౌనంతోనే ఉంటాడు. ఎటు తిరిగి జనసేస, పవన్ను నమ్ముకున్న నేతలు, కేడర్ మునిగిపోయేలా వ్యవహారం ఉంది.