వేగవంతమైన స్పీడ్ను ప్రజలకు అందించేందుకు 5G నెట్వర్క్ దూసుకొస్తోంది. 2021లో సేవలు అందించేందుకు శరవేగంగా సిద్ధం కానుంది. ఇప్పటికే దక్షిణ కొరియాలో 5జీ అందుబాటులో ఉంది. తాజాగా 5జీ వేగం విపరీతంగా పెరిగింది. 2020 లో కేటీ కార్ప్, ఎస్కే టెకీకామ్, ఎల్ హప్లస్ మొబైల్ నెట్వర్క్ల వేగం 690.47 ఎంబీపీఎస్ గా ఉన్నట్టు గుర్తించారు. తొలి ఆరు నెలలు ఇదే 33.91 ఎంబీపీఎస్గా మాత్రమే నమోదయ్యింది. ఆ తరువాత ఆ వేగం ఇరవై రెట్లకు పైగా పెరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి.
ఎక్కే టెలీకామ్ వేగవంతమైన నెట్వర్క్గా ఉండడానికి గల కారణం దాని సగటు డౌన్లోడ్ స్పీడ్ 795.57 ఎంబీపీఎస్ గా ఉండడమేనట. కేటీ కార్ప్(667.48 ఎంబీపీఎస్), ఎల్జీ యూ ప్లస్ (608.49 ఎంబీపీఎస్) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణకొరియాలో 4 జీ డౌన్లోడ్ స్పీడ్ 153.1 ఎంబీపీఎస్గా నమోదైంది.
ప్రపంచంలో మొదటిగా దక్షిణకొరియా నే, 5 జీ ని కమర్షయలైజ్ చేసింది. 5జీ టెక్నాలజీ ఆదేశంలో గతేడాది ఏప్రిల్ లో వేగంగా రూపుదిద్దుకుంది. 10 లక్షల మంది యూజర్లు అక్టోబర్ చివరి నాటికే వచ్చారు. దేశవ్యాప్తంగా 2022 కల్లా 5జీ ని అందించాలని దక్షిణ కొరియా లక్ష్యంగా పెట్టుకుందట. కొన్ని ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్వర్క్ కోసం ఇప్పటికే 25.7 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
భారత్లో జియో ఈ ఏడాది 5జీ నెట్వర్క్ను తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తాము 5 జీ కి సిద్ధమని, ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్గా ఉన్న పేరు పొందిన జియో ప్రకటించింది. అలాగే ఆ సంస్థ నుంచి చౌకగానే 5 జీ ఫోన్లు సైతం వచ్చే అవకాశముంది.