కరోనా సృష్టించిన విలయం.. లాక్ డౌన్ పరిస్థితులతో దేశంలో 30 శాతం నిరుద్యోగం పెరిగింది. కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోతే.. మరికొన్ని రంగాల్లో వేతనాల్లో కోత కనిపించింది. కొన్ని రంగాల్లో ఉద్యోగాలే కష్టమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్ కోలుకుని ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ నివేదిక ప్రకారం జూన్ నెలలో ఉద్యోగాల నియామకాలు 33 శాతం పెరిగాయి.
వైద్య, ఫార్మా రంగంలో ఉద్యోగాలతో పాటు షేర్లు పెరిగాయి. కాకపోతే.. మేతో పోలిస్తే జూన్ నెలలో 27 శాతం నియామకాలు తగ్గాయి. హైదరాబాద్, కోల్ కతా నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కినిపించింది. దేశీయంగా ఫార్మా రంగం ఎంతో కీలకమైందన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఐటీ రంగంలో 19 శాతం ఎక్కువ నియామకాలు జరగడం విశేషం. బీపీఓ రంగం కూడా మంచి వృద్ధి సాధిస్తుండటంతో 48 శాతం వృద్ధితో హైరింగ్స్ జరిగాయి. ఐటీపీఎస్ రంగంలో కూడా ఇదే స్థాయిలో హైరింగ్ యాక్టివిటీస్ పెరిగాయి. ప్రస్తుతం లాభాలు తగ్గినా వచ్చే త్రైమాసికంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
రిటైల్ రంగం ఈ కరోనా కాలంలో పుంజుకుందని తెలుస్తోంది. ఈ రంగంలో హైరింగ్స్ మే నెలతో పోలిస్తే జూన్ నెలలో 77శాతం పెరిగాయని నౌకరీ అంటోంది. ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ఆ సంస్థ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ముడిపదార్ధాలు, ఎగుమతులు, దిగుమతి రంగాల్లో కూడా 77శాతం వృద్ధి నమోదు చేశాయని తెలుస్తోంది.