Karthika Deepam: రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తూ సాగుతుంది కార్తీక దీపం సీరియల్. ఒకపక్క మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకుని, వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మరోపక్క మోనిత బాబు ఏకంగా డాక్టర్ బాబు, దీప దగ్గరికే చేరుకుంటాడు. మోనిత అనుకున్నట్లే శ్రీవల్లి, కోటేష్ కూడా బాబుకు ఆనంద్ అని పేరు పెట్టాలనుకోవడం దీప,కార్తీక్ లకు అనుకోని షాక్.. ఇదిలా ఉంటే రుద్రాణి ఏమో కార్తీక్ ను అప్పుకట్టకపోతే పిల్లల్లో ఒకరిని తీసుకుంటా అని బెదిరించడం..ఇలా రకరకాల ట్విస్ట్ లతో కార్తీక దీపం సీరియల్ ఆసక్తిగా మారింది.
ఇన్ని రకాల ట్విస్ట్ లతో సోమవారం కధ ఎటువంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువ అయిపోయింది. మరి డిసెంబరు 27 సోమవారం ప్రసారం కానున్న కార్తీకదీపం ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరగబోతోందంటే దీప కార్తిక్, పిల్లలతో పిండివంటలు చేస్తానని చెబుతుంది. అలాగే కార్తీక్ కూడా నేను పిల్లలకు ట్యూషన్స్ చెబుతా అంటాడు. కార్తీక్ మాటలు సౌర్య డాక్టర్ బాబు టీచర్ అవుతారన్నమాట అని సరదాగా అంటుంది అలాగే ‘నీ పిండివంటలను నేను మార్కెటింగ్ చేస్తాను దీపా’ అంటాడు కార్తీక్. ‘అదేం వద్దు కార్తీక్ బాబు మీరు ఈ ఊరిలో ప్రజావైద్యశాల అని పెట్టండి అంటుంది దీప.దానికి కార్తీక్ బాబు నేనా ప్రజావైద్యశాలా? అని ఆశ్చర్యంగా దీప వైపు చూస్తాడు.
ఇదిలా ఉండగానే మరోపక్క బస్తీలో ‘వంటలక్క ప్రజావైద్యశాల’ అంటూ బోర్డు పెడుతుంది.దీప,కార్తీక్ బాబు గతంలో బస్తీలో ఉన్న ఇంటి ముందు మోనిత ఆ బోర్డ్ పెట్టిస్తోంది.ఆ బోర్డు చూసి వారణాసితో సహా,బస్తీలో ఉన్న అందరు అక్కడికి వస్తారు. వాళ్ళను చూసి ‘బస్తీవాసులకు శుభవార్త’ అంటుంది మోనిత. బోర్డుపై వంటలక్క ప్రజావైద్యశాల అని ఉన్నా కింద డాక్టర్ మోనిత కార్తీక్ అని రాసి ఉంటుంది. అది చుసిన బస్తీ వాసులు మోనితను ఏమంటారు..? మోనిత దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారా?. అసలు ఇంతకీ టీచర్ అవుదామనుకున్న డాక్టర్ బాబు తన ఆలోచన మార్చుకుని డాక్టర్ అవుతాడా అనే విషయాలు తెలియాలంటే సోమవారం దాకా ఆగాలిసిందే .