Keerthi suresh: గత ఏడాది నుంచి కరోనా వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫాంస్ కి బాగా డిమాండ్ పెరిగింది. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల నుంచి సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి అలరిస్తున్నాయి. అయితే కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు మాత్రం ఆమెకి తీవ్రంగా నిరాశ పరచాయి. గత ఏడాది కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయ్యాయి.
భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలకు విమర్శకుల ప్రశంసల బదులు విమర్శలే ఎదురయ్యాయి. అప్పటి నుంచి ఆమెకి సక్సెస్లు రావడం లేదు. నితిన్ సరసన నటించిన రంగ్ దే కూడా ఆమెకి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తోంది. కోలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన టీజర్లో కీర్తి ఆకట్టుకుంది. దాంతో సర్కారు వారి పాటతో మళ్ళీ ఆమె హిట్ అందుకోవడం గ్యారెంటీ అని చెపుకుంటున్నారు.
Keerthi suresh: కీర్తి సురేశ్ నటించిన ‘సాని కయిధం’ ఓటీటీలో విడుదల
అయితే ఆమె తమిళంలో నటించిన తమిళ క్రైమ్ డ్రామా ‘సాని కయిధం’ ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ తమిళంలో నటించిన మొదటి సినిమా సాని కయిధం. దీనికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా, స్క్రీన్ సీన్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఓటీటీలో ఫ్లాప్ హీరోయిన్గా పేరున్న కీర్తి సురేశ్ నటించిన మరో సినిమా కూడా ఇక్కడే రిలీజ్ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ సినిమాతో తనమీదున్న నెగిటివ్ టాక్ పాజిటివ్గా మారుతుందేమో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!