మనకు అత్యవసరమైన ఖనిజల లో సోడియం కూడా ముఖ్యమైనదే… ఇది శరీరం లో ద్రవాలు సమంగా ఉండేలా చేసేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు, నాడీ వ్యవస్థ చక్కగా పని చేసేలా చేస్తుంది.రక్తపోటు, రక్త ప్రవాహం అదుపు లో ఉండాలంటే,సోడియం అవసరం చాలాఉంది. ఉప్పు ఎక్కువగా వాడితే, హైబీపీకి దారి తీస్తుంది.
గుండె జబ్బలు తప్పవు. ఉప్పు వల్ల మన పేగులు, పొట్ట, పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి. ఉప్పు ఎక్కువైన కూడా అది ప్రమాదకరం. ఎండ ల్లో తిరిగే వాళ్లు డీహైడ్రేట్అవుతుంటారు. వారి శరీరం లో ఉన్న ఉప్పు చెమట, ఇతర మార్గాల్లో బయటకు పోతుంటుంది. అలాంటి వాళ్లు ఒక గ్లాస్ నీటి లో చిటికెడు ఉప్పుకలుపుకుని తాగాలి. ఉప్పు నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగినా మంచిదే. ఇది తిరిగి శరీరాన్నిహైడ్రేట్ చేస్తుంది.ఉప్పు నీటిని పుక్కిలించి ఊయడం వలన చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా నోటిలో బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా మాయమవుతుంది.
కానీ డాక్టర్లు ఇలాంటి సూచనలు ఇవ్వడం లేదు. బదులుగా ఖరీదైన టూత్ పేస్టులు వాడమని చెబుతున్నారు. ఉప్పునీటి లో ఈత కొట్టడం ఎంతో హాయిగా ఉంటుంది. బాత్ టబ్ నీటి లో ఉప్పు వేసి,ఆ నీటి లో స్నానం చేయడం వలన చాల విశ్రాంతి పొందుతారు. నీటి ని శుద్ధి చేసేందుకు చాలా మంది క్లోరిన్ వాడతారు. ఉప్పులో క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఉప్పు,నీటి లో పొటాషియంను సమతుల్యంగా ఉంచుతుంది.
అందువల్ల ఆ నీరు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కళ్ల లో మంటలు కూడా తగ్గు తాయి. కొంతమంది ఎప్సమ్ సాల్ట్ బాత్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ హెప్తాహైడ్రేట్ ఉంటుంది. మెగ్నీషియం ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. చర్మం పై వాపులు, మంటల్నిఉపశమనం కలిగిస్తుంది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.