Konijeti Rosaiah: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే అది ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలుచేసే సంక్షేమ పథకాల వల్లే అన్నది అందరికీ తెలిసిన నిజం.అయితే డాక్టర్ వైఎస్సార్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాయి అంటే అది ఆనాటి ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య వల్లే అన్నది చాలా మందికి తెలియని వాస్తవం.
Konijeti Rosaiah: వైఎస్సార్ లో సగమై..సంక్షేమంలో భాగమై!
పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నారు డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.ఆయన క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఆ పథకాలన్నింటికీ తగిన బడ్జెట్ కేటాయిస్తూ వచ్చారు.ఒక్కమాటలో చెప్పాలంటే సంక్షేమ పథకాల ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే దాని ఆచరణ ఘనత రోశయ్య కే దక్కుతుంది.నిధులు లేకుంటే ఏ పథకమూ అమలు కాదన్నది సింపుల్ లాజిక్.ఆ నిధులు కేటాయించాల్సింది ఆర్థికమంత్రి అన్నది కూడా అందరికీ తెలిసిందే.రోశయ్ అనుభవమున్న ఆర్థికమంత్రి కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేసి ఈ సంక్షేమ పథకానికి నిధుల కొరత రాకుండా చూశారు.అందువల్లే ఆ సంక్షేమ పథకాలన్నీ అమలై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారు.
ఆ పథకాలతోనే జగన్ కు అధికారం!
తన తండ్రి హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వివరించి మళ్లీ తాను రాజన్న రాజ్యం తెప్పిస్తానంటూ వారిని మెప్పించి ఒప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.జగన్ కూడా నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆయన క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా రోశయ్య లాంటి అనుభవజ్ఞులు లేకపోవటం మైనస్సై ఆయన ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు
ఎదురవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.జగన్ కు అధికారం దక్కిందంటే అందులో రాజశేఖరరెడ్డికే కాకుండా ఆనాటి ఆయన ఆర్థిక మంత్రి రోశయ్యకు కూడా సమాన వాటా ఉందన్నది కొణిజేటి మరణానంతరం అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.