Koratala Shiva: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తాజా సమాచారం. మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కోసం కొరటాల దాదాపు నాలుగేళ్ళకు పైగా సమయం కేటాయించాడు. అందుకే, ఇకపై ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు స్టార్ హీరోలతో సినిమాలను లైన్లో పెట్టబోతున్నారు. ఇప్పటికే, ఆచార్య సినిమా పూర్తై రిలీజ్కు రెడీ అవుతోంది. వచ్చే వారం భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ హీరోగా ఒక సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
ఈ సినిమా సూటింగ్ జూన్ నుంచి మొదలవబోతోంది. ఈ ఏడాది చివరి వరకు దాదాపు చిత్రీకరణ పూర్తయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. 2023 సమ్మర్ కానుకగా కొరటాల ఎన్.టి.ఆర్ సినిమా రానుందని తెలుస్తోంది. ఇక ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే, మహేశ్ బాబుకు లైన్ కూడా నచ్చిందని..వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ గ్యారెంటీ అని కొరటాల శివ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
Koratala Shiva: అఫీషియల్గా కూడా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు.
అయితే, మహేశ్ బాబుకంటే ముందు అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ సినిమా ఉంటుందని తెలుస్తోంది. వాస్తవంగా కరోనా ప్యాండమిక్ గనక లేకపోయి ఉంటే గత ఏడాదే కొరటాల – అల్లు అర్జున్ల సినిమా మొదలవ్వాల్సింది. అఫీషియల్గా కూడా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించారు. కానీ, కొరటాల ఆచార్య..అల్లు అర్జున్ పుష్ప ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. ఇక కొరటాల ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత అల్లు అర్జున్తో సినిమాను మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆలస్యం అయితే మాత్రం మహేశ్ బాబుతో సినిమా ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!