NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే… బీజేపీలో కొత్త చ‌ర్చ‌

సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీ రాజ‌కీయం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం ఆ పార్టీ నేత‌లు ఇస్తున్న షాకుల‌కు తోడుగా ఎదుర‌వుతున్న ప‌రిస్థితులు సైతం చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

 

 

ముఖ్యంగా ఎంతో ఆశ‌తో కుదుర్చుకున్న బీజేపీతో పొత్తు ఎత్తుగ‌డ‌తో జ‌న‌సేన‌కు ఏం ప్ర‌యోజ‌నం ద‌క్కుతోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం కోసం జనసేనాని పడుతున్న తాపత్రయం అందరికీ అర్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా అన్న అంశంపై క్లారిటీ రావ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ తీరు చ‌ర్చ‌కు ఆస్కారం ఇస్తోంది.

ప‌వ‌న్‌కు బీజేపీ షాకులు మామూలుగా లేవుగా

ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో బీజేపీ ఇస్తున్న షాకులు మామూలుగా లేవంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించిన జ‌న‌సేన పార్టీ అభ్యర్ధులను ప్రచారంలోకి దింపే సమయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనికి బీజేపీయే కార‌ణం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేందుకు కమిటైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… అనంత‌రం హడావుడిగా నాదెండ్లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. దాదాపు రెండు రోజుల పాటు కేంద్ర బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం వేచి చూశారు. తిరుపతిలో పోటీ చేసేది తామేనని ఈ మధ్యలోనే బీజేపీ రాష్ట్ర నేతలు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ.. ఎక్కడో ఉండిపోయిన చిన్న ఆశతో జేపీ నడ్డాను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తరువాత.. పవన్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆశించిన హామీ దొరకలేదనే అర్ధం అవుతోంది.

హైద‌రాబాద్ గ‌ల్లీలో … ఢిల్లీలో రెండింట ప‌వ‌న్‌కు షాకే

జేపీ నడ్డా పిలిస్తేనే ఢిల్లీ వచ్చామని పవన్‌కల్యాణ్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు అమరావతి, పోలవరంపై కూడా చర్చించామని చెప్పారు. భవిష్యత్‌లో ఏపీలో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైనా చర్చించినట్లు చెప్పారు.
నడ్డాతో జరిగిన భేటీలో తిరుపతి బైపోల్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడామని పవన్ చెప్పారు. అయితే, అభ్యర్ధి ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తిరుపతిలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే దానిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు. పోటీలో నిలిచేది బీజేపీనా, జనసేననా అనేది రెండ్రోజుల్లో తేలిపోతుందని జనసేనాని స్టేట్ మెంట్ ఇచ్చారు.

ప‌వ‌న్ ఆరాటం … బీజేపీతో పోరాటం

తిరుపతి సీటు విషయంలో బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు బలంగా ఉండాలంటే… తమ పార్టీకి కూడా బీజేపీ ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ చాన్స్ త‌క్కువ‌ని అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N