ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. అంతక ముందు హృతిక్ రోషన్ తో నటించిన మొహంజాదారో భారీ డిజాస్టర్ గా మిగలడంతో మళ్ళీ పూజా హెగ్డే ని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు. కాని టాలీవుడ్ లో మాత్రం అన్నీ సూపర్ హిట్ సినిమాలలోనే నటించింది. నాగ చైతన్య, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు ల సినిమాలతో టాలీవుడ్ లో భారీ సక్సస్ లు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
ముఖ్యంగా అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠ పురములో, మహేష్ బాబు తో నటించిన మహర్షి సినిమాలలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. అంతేకాదు లక్కీ హీరోయిన్ అన్న టాక్ కూడా టాలీవుడ్ మేకర్స్ చెప్పుకుంటుండటం తో బాలీవుడ్ లో పూజా కి పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. చాలాకానికి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో నటించిన హౌజ్ ఫుల్ 4 తో మంచి హిట్ దక్కించుకుంది. దాంతో బాలీవుడ్ లో పూజా భారీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం అందుకుంది.
ముఖ్యంగా తన ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం అంటే పూజా కాళ్ళు నేలమీద నిలవడం లేదట. ఇలాంటి అవకాశం ఎంతో అదృష్ఠం ఉంటే గాని రాదని ఉబ్బి తబ్బిబ్బై పోతోంది. అందుకే ఎక్కువగా ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేస్తోందట. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ దీవాలి సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న పూజా రణ్ వీర్ సింగ్ నటించబోతున్న సర్కస్ అన్న సినిమాకి సైన్ చేసింది. ఇక తెలుగులో ప్రభాస్ తో
రాధే శ్యామ్ ..అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలు చేస్తోంది.