న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మరో సారి పొడిగించింది. ఈ విషయాన్నీ కేంద్ర హో శాఖ ప్రకటించింది. దీనితో దేశ వ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానున్నది. కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు పై మార్గదర్శకాలను కాసేపట్లో విడుదల చేయాల్సి ఉంది. ప్రజా రవాణాపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ సారి మార్గదర్శకాలు గతంలో కంటే భిన్నంగా ఉంటాయని ప్రధాని మోదీ సూచన ప్రాయంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరిన్ని సడలింపులకు కేంద్రం అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ను కొనసాగించడమే శ్రేయస్కరమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 90 వేలు దాటింది. కరోనా మరణాల సంఖ్య 2800 దాటింది.
ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ ని పోడిగించాయి.