ఏపీ రాజకీయాల్లో అటు ఆన్ లైన్, ఇటు ఆఫ్ లైన్ స్పందనలతో ఫుల్ బిజీగా గడుపుతూ ఢిల్లీ టు ఏపీ.. ఏపీ టూ ఢిల్లీ ఫుల్ బీజీగా గడిపే విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎవరిస్థాయిలో వారు ఆయనపై ఉన్న ప్రేమను.. ప్రేమగా, వెటకారంగా వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. అయితే… ప్రస్తుతం క్వారంటైన లో రెస్ట్ తీసుకుంటున్న సాయిరెడ్డికి అక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు వైకాపా నేతలు!!
వైకాపాలో జగన్ తర్వాత..? అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారీ ఠక్కున వచ్చే సమధానం… “విజయసాయిరెడ్డి” అని. ఒకవైపు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగ.. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా.. ఇంకోవైపు పలుపార్లమెంటరీ కమిటీల్లో చైర్మన్ గా.. మరికొన్ని కమిటీల్లో మెంబర్ గా ఉంటూ వస్తున్న సాయిరెడ్డి విషయంలో… జగన్ కొన్ని పదవులను కట్ చేయబోతున్నారని కథనాలు వస్తున్నాయి. పార్టీపరంగా ఇప్పటికే ఆయన పరిధిని మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిమితం చేశారన్న వార్తల నడుమ… ఢిల్లీలో వైకాపా ప్రభుత్వ అధికార ప్రతినిధి పాత్రను తొలగించబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి!
అవును… ఢిల్లీలో వైకాపా అధికార ప్రతినిధిగా విజయసాయికున్న ఆ పదవిలో అజయ్ కల్లం రెడ్డిని జగన్ నిమించబోతున్నారని… తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ – కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ని కలిసినప్పుడు సాయిరెడ్డి స్థానే అజయ్ కల్లంను వెంటబెట్టుకుని వెళ్లారని.. ది భవిష్యత్ సూచిక అని వైకాపా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో.. క్వారంటైన్ లో ఉన్న సాయిరెడ్డి కి కరోనా కంటే ఈ కథనాల బాద ఎక్కువైపోతుందన్ని అంటున్నారట ఆయన అభిమానులు!!